
2025 మే 9న, బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుండి స్వతంత్రత ప్రకటించింది.రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ గా పిలువబడుతుంది. బెలూచీ రచయిత మరియు నాయకుడు మిర్ యార్ బెలూచ్ ఈ ప్రకటనను చేశారు. ఈ ప్రకటనతో పాటు, ఆయన ఐక్యరాజ్యసమితిని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించమని కోరారు మరియు భారత ప్రభుత్వాన్ని న్యూఢిల్లీలో బెలూచిస్తాన్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడానికి అనుమతించమని అభ్యర్థించారు. మునుపు, 1975 లో బంగ్లాదేశ్ వేరు పడింది ఇప్పుడు బెలూచిస్తాన్.
💣 ఉద్యమం నుండి ఆయుధ పోరాటం వరకు
బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బెలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (BRA) వంటి సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటానికి దిగాయి. ఇటీవల, బెలూచ్ పోరాటకారులు పాక్ ఆర్మీ కాన్వాయ్పై దాడి చేయడం సంచలనంగా మారింది.
🌍 రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ అంటే ఏమిటి?
బెలూచిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఉన్న మూడు ప్రధాన ప్రావిన్సుల్లో ఒకటి. ఇది దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో ఉంది. అయితే, కొన్ని బెలూచి జాతి ఉద్యమాలు ఈ ప్రాంతాన్ని “స్వతంత్ర దేశంగా” ప్రకటించాలని కోరుతూ “రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్” అనే భావనను తెచ్చారు.
బెలూచిస్తాన్ విమోచన సైన్యం (BLA) మాంగోచార్ నగరాన్ని నియంత్రణలోకి తీసుకుంది మరియు బెలూచిస్తాన్ వ్యాప్తంగా 39 దాడులను నిర్వహించింది.
ఈ స్వతంత్రత ప్రకటనకు అంతర్జాతీయ గుర్తింపు ఇంకా లభించలేదు. అయితే, బెలూచీ వలసవాసులు మరియు మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. భారతదేశంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మరియు విశ్లేషకులు బెలూచీ హక్కులను మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో trend అవుతున్న topic.
ఈ పరిణామాలు దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులను ప్రభావితం చేయవచ్చు. బెలూచిస్తాన్ స్వతంత్రత ప్రకటనపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.