పాకిస్తాన్కు $1 బిలియన్ ప్యాకేజీ విడుదల చేసిన IMF, మీరు మారరా ?

ఇస్లామాబాద్/వాషింగ్టన్ – అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ పాకిస్తాన్‌కు రెండవ విడత సహాయ ధనాన్ని విడుదల చేసింది. ఈ మొత్తం భారత ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు IMF ఇచ్చిన మొత్తంలో ఇది రెండో విడతగా రూ. 1.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం.

భారతదేశం ఈ చెల్లింపును వ్యతిరేకించిన ప్రధాన కారణం – పాకిస్తాన్ ఈ మొత్తాన్ని అణు అభివృద్ధి, జాతీయ భద్రతా వ్యయాలపై వినియోగించే ప్రమాదం ఉన్నదని. పైగా, ఈ దేశం నుండి ఉగ్రవాదానికి మద్దతు కూడా కొనసాగుతోందని భారత్ IMF ముందు అభిప్రాయపడ్డది.

ఇంతకుముందు మార్చి 2025లో IMF పాకిస్తాన్‌కు మొదటి విడతగా రూ. 1.2 బిలియన్ డాలర్లు విడుదల చేసిన విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి నుంచే భారత్ ఈ అంశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చింది.

IMF మాత్రం ఈ నిధులు పూర్తిగా ఆర్థిక పునరుద్ధరణకు మాత్రమే వినియోగించబడేలా పాక్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ‘‘ఈ నిధులు ఆర్థిక స్థిరత్వం, సామాజిక సంక్షేమ, ఉపాధి పథకాలకు మాత్రమే ఉపయోగించాలి’’ అని స్పష్టం చేసింది.

భారత అధికారులు ఏమంటున్నారు?
‘‘ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి నిధులు ఇవ్వడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు తలెత్తుతుంది,’’ అని భారత ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ అయితే ఈ నిధుల విడుదలను తమ గెలుపుగా చెప్పుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఇది ముఖ్యమైన అడుగు అని పేర్కొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top