మే 8 మరియు 9 మధ్య రాత్రి సమయంలో, పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు అంతటా డ్రోన్లు మరియు ఇతర పేలుడు ఆయుధాలతో విస్తృతంగా దాడులు చేపట్టాయి. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ సైన్యం అనేక కాల్పుల విరామం ఉల్లంఘనలకు పాల్పడింది.
ఈ డ్రోన్ దాడులను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది మరియు కాల్పుల విరామ ఉల్లంఘనలకు తగిన ప్రతిఉత్తరం ఇచ్చింది.
భారత సైన్యం దేశ సార్వభౌమాధికారం మరియు భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంది. ఏవైనా దుష్ట యోచనలకైనా శక్తివంతమైన ప్రతిస్పందన ఇవ్వబడుతుంది.