రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దూతగా ట్రంప్, Nobel peace prize !!

May 20,2025, Washington DC: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సంభాషణ ఫలితంగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి దారితీసే అవకాశం ఉందని, అలాగే యుద్ధం తర్వాత రష్యా-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ, “రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిస్తే, రష్యాతో అమెరికా విస్తృతంగా వాణిజ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రష్యాలో ఉద్యోగాలు మరియు సంపద సృష్టికి దారితీస్తుంది. అదే విధంగా, ఉక్రెయిన్ కూడా తన దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవడంలో వాణిజ్య ప్రయోజనాలను పొందవచ్చు,” అని అన్నారు.

ఈ చర్చలకు సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌లతో కూడా ట్రంప్ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అలాగే, వాటికన్ ప్రతినిధి పోప్ ఈ చర్చలను నిర్వహించడానికి ఆసక్తి చూపినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఈ యుద్ధం ఒక విషాదకర రక్తపాతం. దీనిని ముగించేందుకు చర్చలు వెంటనే ప్రారంభం కావాలి. ప్రక్రియ మొదలవుతుంది!” అని ట్రంప్ ఉద్ఘాటించారు.

నిన్న ఇండియా , పాకిస్థాన్ మధ్య ఒక ceasefire ఒప్పందం కుదిర్చి ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా చర్చలు, ఇలాంటి దౌత్య కార్యక్రమాలకు నోబెల్ peace prize ఇవ్వకుండా ఎలా ఉంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top