శశి థరూర్ : నాకు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా దేశమే ఎక్కువ !!

May 16,2025: శశి థరూర్‌కు ఆల్ పార్టీ యాంటీ-టెర్రర్ డెలిగేషన్ నేతగా బాధ్యత

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ను యాంటీ-టెర్రర్ అంశంపై ఏర్పాటైన ఆల్ పార్టీ డెలిగేషన్‌కు నాయకత్వం వహించమని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా థరూర్ మీడియాతో మాట్లాడుతూ, “ఇలాంటి సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవంగా ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా, దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న పని,” అని తెలిపారు.

ప్రభుత్వ ఆహ్వానాన్ని పార్టీని సంప్రదించకుండానే వెంటనే అంగీకరించానని, దేశ ప్రయోజనం ముందు పార్టీ ప్రయోజనం చిన్నదని స్పష్టం చేశారు మరియు మొదటగా దేశం ఆ తర్వాతే పార్టీ అన్నారు. ఆహ్వానం వచ్చిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా సమాచారం ఇచ్చానని చెప్పారు.

ఇలాంటి డెలిగేషన్లు గతంలో కూడా ఏర్పడినట్టు గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, రాజకీయ భేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని థరూర్ పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top